ETV Bharat / bharat

బ్రహ్మపుత్రపై చైనా డ్యాం- అలా చేస్తే భారత్​కు లాభం!

author img

By

Published : Dec 1, 2020, 6:59 PM IST

చైనా తన పరిధిలోని బ్రహ్మపుత్ర నదిపై ఓ కొత్త డ్యాంను నిర్మించనుంది. దీని వల్ల భారత్​కు నష్టం కలుగుతుందని నదీజలాల ఇంజినీరింగ్​ నిపుణులు నయన్​ శర్మ్​ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్​లో భారత్​ను ప్రాథమిక వాటాదారుగా చేర్చాలని సూచించారు. అన్ని వర్గాలు లబ్ధిపొందాలంటే కలిసి పనిచేయాలన్నారు.

'China's Tsangpo dam only with India, Bangladesh collaboration'
బ్రహ్మపుత్రపై చైనా డ్యాం- భారత్​కు నష్టం!

యార్లుంగ్​-సాంగ్​పొ నదిపై చైనా తలపెట్టిన ఆనకట్టతో భారత్​కు ప్రమాదం పొంచి ఉందని నదీజలాల ఇంజినీరింగ్​ నిపుణులు ఈటీవీ భారత్​తో వెల్లడించారు. అన్ని వర్గాలు లబ్ధిపొందాలంటే కలిసి పనిచేయడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు.

చైనాలోని యార్లుంగ్​-సాంగ్​పొ నది.. భారత్​లోని అసోంలో బ్రహ్మపుత్రగా, బంగ్లాదేశ్​లో పద్మగా ప్రవహిస్తుంది. దీనిపై చైనా ఓ ఆనకట్టను నిర్మిస్తోంది. అయితే ఇందులో భారత్​-బంగ్లాదేశ్​ను వాటాదారులుగా చైనా చేర్చాలని అభిప్రాయపడ్డారు ఐఐటీ రూర్కీ అధ్యాపకులు, 45ఏళ్లుగా వివిధ నదీజలాల ఇంజినీరింగ్​ ప్రాజెక్ట్​లో పని చేసిన ప్రొఫెసర్​ నయన్​ శర్మ.

"నేను ఈ నదికి సంబంధించి పనుల్లో పని చేశాను. చైనా నిర్ణయంతో భారత్​-బంగ్లాదేశ్​కు ముప్పుపొంచి ఉంది. ముఖ్యంగా భద్రత, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంపై సమస్యలున్నాయి. ముందుకెళ్లాలని చైనా నిర్ణయించుకుంటే.. భారత్​-బంగ్లాదేశ్​ను ప్రధాన వాటాదారులుగా చేర్చుకోవాలి. అప్పుడే ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు."

--- ప్రొ. నయన్​ శర్మ, ఐఐటీ రూర్కీ

ఎక్కువ విద్యుత్​ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న చోటే డ్యాంను నిర్మిస్తామని.. చైనా అధికారిక పత్రిక గ్లోబల్​ టైమ్స్​ కథనం ప్రచురించింది. భారీ హైడ్రోపవర్​ ప్రాజెక్టు నిర్మించి.. దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్​ను పొరుగు దేశాలకు కూడా పంచే యోచనలో ఉన్నట్టు పేర్కొంది. అయితే డ్యాం నిర్మించినప్పటికీ.. నది ప్రవహిస్తున్న దేశాల్లో ఎలాంటి నీటి కొరత ఉండదని తెలిపింది.

(రచయిత-సంజీవ్ బారువా)

ఇదీ చూడండి:- 'బ్రహ్మోస్​'కు భలే గిరాకీ- భారత్​ కీలక షరతు

యార్లుంగ్​-సాంగ్​పొ నదిపై చైనా తలపెట్టిన ఆనకట్టతో భారత్​కు ప్రమాదం పొంచి ఉందని నదీజలాల ఇంజినీరింగ్​ నిపుణులు ఈటీవీ భారత్​తో వెల్లడించారు. అన్ని వర్గాలు లబ్ధిపొందాలంటే కలిసి పనిచేయడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు.

చైనాలోని యార్లుంగ్​-సాంగ్​పొ నది.. భారత్​లోని అసోంలో బ్రహ్మపుత్రగా, బంగ్లాదేశ్​లో పద్మగా ప్రవహిస్తుంది. దీనిపై చైనా ఓ ఆనకట్టను నిర్మిస్తోంది. అయితే ఇందులో భారత్​-బంగ్లాదేశ్​ను వాటాదారులుగా చైనా చేర్చాలని అభిప్రాయపడ్డారు ఐఐటీ రూర్కీ అధ్యాపకులు, 45ఏళ్లుగా వివిధ నదీజలాల ఇంజినీరింగ్​ ప్రాజెక్ట్​లో పని చేసిన ప్రొఫెసర్​ నయన్​ శర్మ.

"నేను ఈ నదికి సంబంధించి పనుల్లో పని చేశాను. చైనా నిర్ణయంతో భారత్​-బంగ్లాదేశ్​కు ముప్పుపొంచి ఉంది. ముఖ్యంగా భద్రత, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంపై సమస్యలున్నాయి. ముందుకెళ్లాలని చైనా నిర్ణయించుకుంటే.. భారత్​-బంగ్లాదేశ్​ను ప్రధాన వాటాదారులుగా చేర్చుకోవాలి. అప్పుడే ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు."

--- ప్రొ. నయన్​ శర్మ, ఐఐటీ రూర్కీ

ఎక్కువ విద్యుత్​ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న చోటే డ్యాంను నిర్మిస్తామని.. చైనా అధికారిక పత్రిక గ్లోబల్​ టైమ్స్​ కథనం ప్రచురించింది. భారీ హైడ్రోపవర్​ ప్రాజెక్టు నిర్మించి.. దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్​ను పొరుగు దేశాలకు కూడా పంచే యోచనలో ఉన్నట్టు పేర్కొంది. అయితే డ్యాం నిర్మించినప్పటికీ.. నది ప్రవహిస్తున్న దేశాల్లో ఎలాంటి నీటి కొరత ఉండదని తెలిపింది.

(రచయిత-సంజీవ్ బారువా)

ఇదీ చూడండి:- 'బ్రహ్మోస్​'కు భలే గిరాకీ- భారత్​ కీలక షరతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.